జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీ సీఎం జగన్ ప్రసన్నం చేసుకుంటున్నారా.. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ను రాష్ట్రానికి మేలు చేసేవిధంగా మలచుకుంటున్నారా.. ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టుగా గౌరవిస్తూ.. మంచి పదవి ఆఫర్ చేస్తున్నారా..


ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను నియమించబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కూడా అగ్రగామిగా నిలపాలన్న ప్రయత్నాల్లో భాగంగా మాంచి సెలబ్రిటీలను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని జగన్ భావిస్తున్నారట.


ఆ ప్రయత్నాల్లో జూనియర్ ఎన్టీర్ పేరు అగ్రస్థానంలో పరిశీలనలోఉందట. ఎన్టీఆర్ తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ పేర్లు కూడా తెరపైకి వస్తోంది. మరి జగన్ సర్కారు ప్రతిపాదనకు ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరమే.


ఎందుకంటే ఇప్పట్లో ఎలాంటి వివాదాల్లోకీ ఎన్టీఆర్ వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాడు. స్వయంగా మామ నార్నె శ్రీనివాస్, ఆప్తుడు కొడాలి నాని వైసీపీలో ఉన్నా.. ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతాడా అన్నది అనుమానమే. చూడాలి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: