అప్పుడు ఇవ్వడం తీర్చలేకపోతే చంపేంత పని చేయడం ఇదీ కాల్ మనీ దందా.  పేదవారిని టార్గెట్ చేసుకొని డబ్బు ఆశ చూపించి ఇష్టానుసారంగా అధిక వడ్డీకి అప్పు ఇవ్వడం అది తీర్చలేని పరిస్థితిలో ఉంటే వారిని దారుణంగా హింసించడం కాల్ మనీ వ్యాపారంలో ఒక భాగం అయ్యింది.  ఆ మద్య ఏపిలో కాల్ మనీ వ్యవహారంపై అప్పతి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చారు. 

 కాల్ మనీ వ్యాపారులు మహిళలను తమ అవసరాలు తీర్చాలని..లేదంటే అప్పు తీర్చాలని బెదిరించే స్థాయికి వెళ్లారు.  తాజాగా ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోందని,డీజీపీ వెంటనే కల్పించుకుని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు.  కాల్ మనీ మాఫియా గురించి అందరి కన్నా మీకే ఎక్కువ తెలుసునని డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ మాఫియా బారిన పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీలు కాపాడాలని కోరారు. "డీజీపీ గారు కాల్ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ మీకే తెలుసు కాల్మని మాఫీయా బారిన పేద ప్రజలు పడకుండా కాపాడండి సార్" అంటూ సీఎం వైఎస్ జగన్ ను సైతం ట్యాగ్ చేశారు.  మరి సీఎం జగన్ ప్రభుత్వం ఈ కాల్ మనీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: