కర్ణాటక ఎమ్మెల్యేల అసంతృప్తితో గత రెండు వారాలుగా రాజకీయాలు రోజుకో మలుపు తీరుగుతూ వచ్చాయి. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదంటూ గవర్నర్ కు రాజీనామా లేఖలు సమర్పించగా ఆయన  కూడా స్పీకర్ వివరణ కోరారు. స్పీకర్ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు తమ రాజీనామాలు ఆమోదించడంలేదంటూ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశారు.

మరళ సుప్రీం కోర్టు కూడా స్పీకర్ కు సంజాయిషీ చెప్పమని కోరింది. ఈమేరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన స్పీకర్ రాజీనామాల గురించి ఎమ్మెల్యేలను వివరణ కోరారు. అయితే ఎడ్యూరప్పా తనను సీఎం కావాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలుపగా సీఎం కుమారస్వామి బలనిరూపణకు దిగారు. దీంతో...  ఇక కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదని అందరూ భావించారు.

శుక్రవారం బలపరీక్ష జరగాల్సి ఉండగా... సభ వాయిదా పడటంతో అది జరగేలేదు.  రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా.... శుక్రవారం నాటికి అసెంబ్లీలో ఉన్న సీన్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జేడీఎస్ త్యాగానికి సిద్ధపడిందని సమాచారం. అయితే... రెబల్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేను వెనక్కి రప్పించడంతోపాటు... సీఎం కుమారస్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన తన సీఎం పదవికి త్యాగం చేసి బాధ్యతలు కాంగ్రెస్ కి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరోక్షంగా ఓ కాంగ్రెస్ నేత ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కూటమిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.  సిద్ధరామయ్య, పరమేశ్వర, శివకుమార్ లలో ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టునున్నట్లు సమాచారం. ఎక్కువ శాతం అవకాశాలు శివకుమార్ కే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... బీజేపీ ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ.. సీఎం కుమారస్వామి అసమ్మతి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. మరి వారు వెనక్కి తగ్గుతారో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా... నేటితో కర్ణాటక సంక్షోభానికి క్లైమాక్స్ పడనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: