కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులతో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మరో సంచలన ప్రకటన చేసింది. తాజాగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సీఎం పదవిని త్యాగం చేయడానికి కుమారస్వామి సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ నుంచి ఒకరు సీఎం పదవి చేపట్టే అవకాశముందని చెప్పాడు. సంకీర్ణ సర్కారును కాపాడేందుకే జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.


కాగా కుమారస్వామి సీఎం పదవి వదులుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ లో ప్రధానంగా ముగ్గురి పేర్లు సీఎం రేసులో వినపడుతున్నాయి. మాజీ సీఎం సిద్ధరామయ్యతోపాటు పరమేశ్వర - డీకే శివకుమార్ లలో ఎవరినో ఒకరిని అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను ఈ మేరకు శివకుమార్ వెనక్కి రప్పించే ప్రయత్నాలను చేస్తున్నారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అసంతృప్తులు మెజార్టీగా ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ కే మద్దతు పలుకుతున్నారని సమాచారం. ఇక కీలకమైన జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా సిద్ధరామయ్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శివకుమార్ సీఎం అయితేనే మద్దతిస్తామని ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి పరమేశ్వరను కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య లేదా డీకే శివకుమార్ లలో ఒకరు కన్నడ సీఎం పీఠం అధిరోహించవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: