టీడీపీ తమ్ముళ్ళకు ఓటమి తరువాత మైండ్ బ్లాంక్ అయింది. అందుకో గెలిచిన ఎంపీ కూడా ఒకరున్నారు. ఆయనే విజవాడకు చెందిన కేశినేని నాని. ఆయన మాటలు, ట్వీట్లు చూస్తూంటే ఎంతలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారఓ అర్ధమవుతుంది. తన పర భేదం లేకుండా అందరి మీద బాణాలు ఎక్కుపెట్టడం వరకూ ఐతే మాత్రం నానిని మెచ్చుకోవాలేమో.


ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా జగన్, ఆ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి సాధించాలట.ఆ విధంగా సాధిస్తే వారిని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి సన్మానం చేస్తారట. బాగానే ఉంది. మరి తేలేకపోతే. ఆ సంగతి మీరు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీయడం నానికే చెల్లింది. 


అయిదేళ్ళలో నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి కేంద్ర మంత్రులుగా చేసిన టీడీపీకి ఆ సోయి లేకపాయే. హోదా మాట మీద ఎన్నికల్లో గెలిచి దాన్ని తుంగలోకి తొక్కిన టీడీపీ ప్యాకేజ్ ముద్దు అంటూ బేరాలు కూడా కుదుర్చుకుని పూర్తిగా ఏపేలోని అయిదు కోట్ల మంది చేతులు కట్టేసింది. ఇపుడు కొత్తగా జగన్ అధికారంలోకి వచ్చినా కూడా కేంద్రం అదే ప్యాకేజి బూచిని చూపుతోందంటే ఆ ఫెయిల్యూర్ ఎవరిదో నానే చెపాలి మరి. 


అన్నీ చేసేది ఇపుడు తాపీగా హోదా బండని నెత్తిన పెట్టి సన్మానం చేస్తా అంటూ సెటైర్లు వేయడం అంటే  తనని ఎన్నుకున్న ప్రజల మీద‌ ఓ ఎంపీగా ఆయన బాధ్యత ఇంతేనా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇపుడు నాని తాము కాడి వదిలేశామని చెబుతున్నారా. లేక  హోదా రాదు అని గట్టి నమ్మకంగా ఉన్నారా ఆ సంగతి కూడా చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: