కన్నా లక్ష్మీనారాయణకు   ఇపుడు కాని కాలం నడుస్తోంది. ఆయన్ని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేసిన నాటి ముద్దూ ముచ్చటా ఇపుడు బీజేపీలో లేదు. ఆయన వల్ల పార్టీ బలపడదని డిసైడ్ అయ్యాకే పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. నిజానికి పేరుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడే కానీ హవా మాత్రం జాతీయ నాయకులదే. పార్టీలో ఏ లీడర్ చేరుతున్నారన్న. కనీసం ఆ సమాచారం కూడా కన్నాకు తెలియదంటే  పార్టీలో ఆయన పవర్ ఏంటో అర్ధమైపోతోందిగా


అలా రాం మాధవ్ ఏకంగా కన్నాకు దశాబ్దాల పాటు శత్రువుగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లి మరీ విందారగించారు. అంతటితో ఆగకుండా అయన్ని పార్టీలో చేరమని ఆహ్వానించారు. దానికి సరేనన్న పెద్దాయన తట్టా బుట్టా సర్దేశారు. కన్నాకు ఓ విధంగా ఇది షాకింగ్ న్యూసే మరి. తన శత్రువే తనని కాదని తన పార్టీలో చేరి తననే సైడ్ చేయడం అంటే ఎవరైనా సహించగలరా. రాయపాటి లేటెస్ట్ గా చెప్పేశారు తాను బీజేపీలో చేరిపోతున్నానని. 


అంటే ఇక కన్నాకు కమలం పార్టీతో కటీఫ్ ఐనట్లేనని అంటున్నారు. రాయపాటికి విశేష ప్రాధాన్యత ఇవ్వడం కన్నా వర్గీయులకు మింగుడుపడడంలేదంటున్నారు. ఇక మరో వైపు  రేపటి ఎన్నికల్లో పార్టీ గెలిస్తే నేనే సీఎం అనే రేంజిలో సుజనా హడావిడి చేస్తున్నారు.  హై కమాండ్ కూడా ఆయనకు ప్రయారిటీ ఇస్తోందని అంటున్నారు.సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్న కన్నా అన్నీ తెలిసి కూడా జగన్ సర్కార్ మీద  ఇటీవల హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.


ఆ విధంగానైనా తనని పదవిలో ఉంచుతారని ఆయన భ్రమ‌లో ఉన్నట్లున్నారు. కానీ  సీన్ రివర్స్ అవుతోంది. రేపో మాపో ఫిరాయింపు నేతల్లో ఒకరిని తెచ్చి బీజేపీ ప్రెసిడెంట్ ని చేస్తారు, రాయపాటి సాంబశివరావుని పార్టీలోకి తెచ్చేశారు. ఇక మిగిలింది కన్నాకు ఏమీ లేదు. అనవసరంగా పెద్ద నోరు చేసుకుని జగన్ని విమర్శించినందుకు వైసీపీలోకి పోదామన్నా రేపు  అవకాశం ఉండదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: