మద్యం ఎక్కువై కొంత మంది మరణిస్తుంటారు..లేదా ఏదైనా ప్రమాదాలు జరగడం వల్ల మరణిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మద్యం సేవించి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ పట్టణంలో వెలుగుచూసింది. బారాబంకీకి చెందిన ఓ యువకుడు పీకలదాకా మద్యం తాగి...అత్తగారింటికి వెళుతుండగా మార్గమద్యలో ఓ కుక్క అతని వెంట పడింది..దాంతో భయంతో పరుగు తీస్తూ పక్కనే ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. 

అయితే అదే అతను చేసిన పెద్ద తప్పిదం అయ్యింది. .మందుబాబు తమ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగని భావించిన ఇంటి కుటుంబసభ్యులు వేడిగా ఉన్న ఇనుపచువ్వలతో కాల్చి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఆ యువకుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో అది గమనించక వారు ఇనుపచువ్వలతో కాల్చారు.

దాంతో అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.   ఈ ఘటనపై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశామని బారాబంకీ ఎస్పీ ఆకాష్ తోమార్ చెప్పారు. నిందితులంతా ఒకే కుటుంబం వారని ఎస్పీ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: