ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన నివాసం ఉన్న విషయమూ తెలిసిందే. ప్రస్తుతం తాడేపల్లి నివాసంలోనే ఉంటున్నా.. అప్పుడప్పుడూ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికీ వెళ్తుంటారు.


అందుకే.. సీఎం హోదాకు తగ్గట్టు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలోనూ మార్పులు చేయాల్సి వచ్చింది. దీని కోసం రూ.24.50లక్షలు విడుదల చేస్తూ ఏపీ ఆర్&బీ శాఖ జీవో విడుదల చేసింది. ఈ డబ్బుతో అవసరమైన ఏర్పాట్లు చేయబోతున్నారు.


మొత్తం 24.50 లక్షల్లోని... రూ.12.50లక్షలతో బ్యాగేజ్ చెకింగ్ రూమ్ నిర్మిస్తారు. దీంతో పాటు సీసీటీవీ రూమ్, స్టాటిక్ రూమ్‌, పోలీస్ ఆఫీసర్స్ రూమ్‌ను నిర్మిస్తారు. మరో రూ.12లక్షలతో భద్రత కల్పించే పోలీసుల కోసం గదులు ఏర్పాటు చేస్తారు.


విడుదల చేసిన నిధులు, ఏర్పాటు చేయనున్న సౌకర్యాలతో పోలిస్తే.. నిధుల విడుదల సమంజసంగానే కనిపిస్తోంది. కోట్లలో కాకుండా లక్షల్లోనే ఏర్పాట్లకు పచ్చజెండా ఊపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: