ఆడకూతురుకి కన్న తండ్రి అంటే భరోసా..బలం,ధైర్యం.  కానీ ఆ తండ్రి చేసిన నీచమైన పనికి సమాజమే సిగ్గుపడే విధంగా ఉంది.  ఓ బాలిక చేసిన ఫిర్యాదు ఇపుడు రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నతండ్రే దగ్గరుండి తనపై అత్యాచారం చేయించాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి వివిధ రకాల సమస్యలపై బాధితులు ఫిర్యాదు వస్తున్నాయి. 

ఇందులో భాగంగా ఓ బాలిక చేసిన ఫిర్యాదు అందరి హృదయాలు కలచి వేసింది. ఈ దారుణమైన సంఘటన గుంటురు లో చోటు చేసుకుంది. సీఎం జగన్ ఆదేశం మేరకు సోమవారం ఏపీ వ్యాప్తంగా స్పందన కార్యక్రమం జరిగింది.  ఈ 'స్పందన' కార్యక్రమంలో పట్టణ ఏఎస్పీ వైటీ నాయుడు ముందు ఓ బాలిక కన్నీటితో ఫిర్యాదు చేసింది. 

తమకు కావలసిన వాడు, తమ బంధువు అని తన తండ్రి ఓ యువకుడిని ఇంటికి తీసుకొచ్చాడనీ, అతను కొట్టి, సిగరెట్లతో కాల్చి భయపెడుతూ, అత్యాచారం చేశాడని, ఆ సమయంలో తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడని ఆ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ కేసు విషయంలో వైటీ నాయుడు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఆ యువతి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేసు నుంచి అతని పేరును పోలీసులు తొలగించారని ఆమె చెప్పగా, తాను విచారణ జరిపించి న్యాయం చేస్తానని నాయుడు అభయమిచ్చారు. మరోవైపు ఇలాంటి తండ్రికి కఠిన శిక్ష పడాలని మహిళాసంఘాలు కోరుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: