గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులు, హత్యలు, చిన్నారులపై అత్యాచారాలు, చైన్ స్నాచింగ్ వ్యవహారలు పెచ్చుమీరుతున్నాయి.  ఓ వైపు పోలీసులు నేరస్తుల విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నా కొంత మంది దుర్మార్గు ఈ చర్యలకు పాల్పపడుతున్నారు.  తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్‌లో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ అయిన బాలుడి పేరు జసిత్.  మండపేట విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మ తో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ (4) అనే బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి నాయనమ్మను కొట్టి ఎత్తుకు పోయారు. 


శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూక వెంకటరమణ, నాగవల్లికి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు జషిత్ ఉన్నాడు. దంపతులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. బదిలీలో భాగంగా ఏడాది క్రితం మండపేటకు వచ్చిన ఆ కుటుంబం విజయలక్ష్మీ నగర్‌లోని సాయిధరణి ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్‌లో నివాసముంటోంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలియగానే తల్లి తల్లడిల్లిపోయింది. బాలుడి కిడ్నాప్ అయ్యి 18 గంటలు దాటింది. ఇంకా ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. మండపేట పోలీసులు రామచంద్రాపురం, ఆలమూరు, అనపర్తి పోలీసులను పోలీసులు అలర్ట్ చేశారు.


బాలుడిని ఎవరు కిడ్నాప్ చేశారనేది మిస్టరీగా మారింది. అయితే  డబ్బు  కోసమే అయితే ఇప్పటికే కాల్ రావాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఇది సరిపోని వ్యక్తుల పనా, లేక డబ్బు కోసం చేసి పనా అనేది తేలాల్సి ఉంది. తెలిసినవారే బాలుడిని కొంత దూరం వెంబడించారు. అయితే క్షణాల్లోనే నిందితులు పారిపోయారని స్థానికులు చెప్పారు. కిడ్నాపర్‌ నుంచి తమకు ఎలాంటి ఫోన్‌ రాలేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ చిన్నారి కిడ్నాప్‌నకు గురవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: