విజయవాడ పాలిటిక్స్‌లో గత పక్షం రోజులుగా సోషల్ మీడియా వార్‌ హోరెత్తిపోతోంది. ముందుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని... ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ప్రారంభమైన ట్వీట్ల యుద్ధం హోరెత్తిపోయింది. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుని ట్వీట్ల వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరడంతో బుద్ధా వెంకన్న సైలెంట్ అయిపోయారు. అయితే ఎంపీ నాని మాత్రం ట్వీట్ల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి సోషల్ వార్ లో దూరికిపోయిన వైసీపీ నేత నానిని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియాలో పంచులు వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.


పీవీపీ తమ మేటర్ లోకి ఇన్వాల్‌ కావడంతో నాని  కూడా పీవీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ముందుగా నాని  వెంక‌న్న‌ని టార్గెట్ గా చేసుకుని కొబ్బరి చిప్పల దొంగ‌... సైకిల్ బెల్లుల‌ దొంగ‌ అని విమర్శించిన సంగతి తెలిసిందే. వెంక‌న్న సైతం నాని ఫైనాన్ష్ ఎగ్గొట్టాడ‌ని కౌంట‌ర్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత నాని ఓ ప్ర‌బుద్ధుడు అంటూ వెంక‌న్న‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.


ఇక నానిపై వారం రోజులుగా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తోన్న పీవీపీ  `` మన కింగ్ కాంగ్ (కేశినేని నాని)కు పదివేల ఓట్లు సాధించి పెట్టిన ప్రబుద్ధుడు`` అంటూ ఆయన తాజాగా చేసిన ట్వీట్ కలకలం రేపింది. ఈ ఎన్నిక‌ల్లో నానిపై పీవీపీ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అంటే బుద్ధా ఎందుకు ప‌నికిరాడ‌ని నాని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.


ఇప్పుడు అదే బుద్ధా నాని గెలుపున‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రించాడ‌ని పీవీపీ చెప్పిన‌ట్ల‌య్యింది. నువ్వు ఎందుకూ పనికిరాని వాడని పేర్కొన్న బుద్ధా వ‌ల్ల నువ్వు గెలిచావ‌ని పీవీపీ ప‌రోక్షంగా నానిని టార్గెట్ చేశాడు. పైగా నానికి మ‌న కింగ్ కాంగ్ అంటూ సెటైరిక‌ల్ పేరు కూడా త‌గిలించేశాడ‌న్న గుస‌గుస‌లు బెజ‌వాడ‌లో వినిపిస్తున్నాయి. ఈ ట్వీట్ల‌తో బెజ‌వాడ రాజ‌కీయం మామూలుగా వెడెక్కడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: