ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ సంచలన ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ ఓర్వలేకపోతున్నారాని, నారా లోకేష్ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ గెలిచింటే వైఎస్ జగన్ కి చుక్కలు చూపించేవారని అతని కామెంట్ బాక్స్ లో వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 


నిన్నటి వరుకు పాలకపక్షంపై ఎన్నో విమర్శలు చేసిన లోకేష్ ఈరోజు అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుతో కోపంగా ఉన్నారు. సస్పెన్షన్ వేటు నారా లోకేష్ గుండెల్లో అగ్గి రాజేసింది. ఉదయం నుంచి ట్విట్టర్ వేధికగా వైసీపీపై మండిపోతున్నారు. వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే.. రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ. అంటూ ఒకసారి కామెంట్ చేస్తే.. 


మరోసారి 45 ఏళ్లకే పిన్షన్ అన్నారు ఇప్పుడు ఇవ్వడం లేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?' అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు ఒక దద్దమ్మ మరో ఒకరిని దద్దమ్మ అంటున్నాడు అని ఫైర్ అవుతున్నారు. నారా లోకేష్ చేసిన ఈ కామెంట్లు వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి అని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: