ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆగస్టులో జరిగే అమెరికా పర్యటన ఖరారైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ టూర్ కు ముందే జగన్ వేరే దేశం వెళ్లదలుచుకున్నారు.కుటుంబంతో కలిసి జగన్ జెరుసలెం వెళ్లనున్నారని సమాచారం. ఆగస్ట్ లోనే వైయస్ జగన్ రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చింది.


ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముగిసిన వెంటనే జగన్ కుటుంబం విదేశీ పర్యటనలకు వెళ్ళనున్నారు. అయితే ఈ నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ముగిసిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖున జెరుసలేం వెళతారు. ఐదురోజులపాటు అక్కడే పర్యటన చేసి తిరిగి ముఖ్య మంత్రి ఆగస్టు ఐదున హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ తిరిగి అమరావతికి రానున్నారు, ఈ పర్యటన ముఖ్యమంత్రి వ్యక్తిగతమైనదని చెబుతున్నారు. ప్రతీయేటా జగన్ కుటుంబం జెరుసలెం వెళుతుందని కానీ ఈ సారి ఎన్నికల్లో లతో బిజీ కావడంతో పర్యటన వాయిదా పడిందని అన్నారు.


జెరుసలేం పర్యటన తరువాత ఆగస్ట్ లో పదిహెడు నుంచి ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రి జగన్ అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారు. పదహారున హైదరాబాద్ నుంచి బయల్దేరి పదిహేనున నార్త్ అమెరికా తెలుగు కమ్మ్యూనిటి ఆహ్వాన సభల్లో పాల్గొంటారు. డల్లాస్ లోని కె బెల్లే కన్వెన్షన్ సెంటర్ ప్రవాస భారతీయులతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి హాజరవుతారు. అయితే విదేశీ పర్యటన చేయాలంటే పాస్ పోర్ట్ అవసరము, సీఎం జగన్ మూడ్రోజుల క్రితమే సాధారణ పాస్ పోర్ట్ స్థానంలో డిప్లమో మోటెక్ పాస్ పోర్ట్ను కూడా తీసుకున్నారు.


డిప్లోమోటెక్ పాస్ పోర్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం ప్రధానికి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రుల్లో గవర్నర్ రాయబారులకు మాత్రమే ఈ పాస్ పోర్ట్ జారీ చేస్తారు. ఈ పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తులకు విమానాశ్రయంలో నేరుగా ప్రైవేశించి అవకాశం ఉంది.అక్కడ అలాంటి తనిఖీల్లో ఉండవు నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు.ఈ పాస్ పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాలకూ వెళ్లేటప్పుడు ఆ దేశానికే ప్రాతినిధ్యం వహించే అత్యంత ముఖ్యులుగా గౌరవిస్తారు. ఈ నేపధ్యంలోనే విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్టు ఆఫీసుకు తన సతీమణితో ముఖ్యమంత్రి జగన్ వెళ్లి పాస్ పోర్ట్ ను అందు


మరింత సమాచారం తెలుసుకోండి: