పథకం ప్రకారం మాటు వేసి ఓ బాలుని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు .దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండపేట విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మ తో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ (4) అనే బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి నాయనమ్మను కొట్టి ఎత్తుకు పోయారు.ప్రశాంతంగా ఉండే మండపేటలో కిడ్నాప్ సంఘటన వులిక్కిపడినట్లుగా చేసింది. స్థానిక విజయలక్ష్మి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.  స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్న నూక వెంకటరమణ కుమారుడు జషిత్(4) ను నాయనమ్మ పార్వతి సమీపంలో ని అపార్టుమెంట్ వద్దకు ఆదుకునేందుకు తీసుకుని వెళ్ళింది.

అక్కడ నుండి తాము నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారి లోని శ్రీ సాయి ధరణి ప్లాజా కు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ ప్రశ్నించాడు. వెను వెంటనే ఆమె పై పిడి గుద్దులు గుద్ది గాయ పర్చాడు.వెంటనే బాలుడిని ఎత్తుకుని మోటర్ సైకిల్ పై బాబు ను ఎత్తుకెళ్లాడు. కొద్దిదూరం పరుగులు తీసిన పార్వతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమి గుడారు.విషయంతెలుసుకుని వెంటనే బైపాస్ రోడ్ లో వెళ్లారు.మోటార్ సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు వెళ్లడాన్ని గమనించిన వారు వాహనాన్ని వెంబడించారు.అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు.

సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దీంతో పోలీసులు ఎలార్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్టారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి ఆచూకీ కనుగొనేందుకు రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్ నేతృత్వంలో రూరల్ సిఐ మంగాదేవి, టౌన్,రూరల్ ఎస్ ఐ లు రాజేష్ కుమార్,దొరరాజు లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టల్సిఉంది. ఎవరైనా తెలిసిన వారే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాదితుల నుండి పోలీసులు వివరాలు సేకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: