సంఖ్యాశాస్త్రాన్ని అందుకే నమ్మాలంటారు. వాటికీ విలువుంది. పవరుంది. 23 అంటే చాలు ఏపీలో టీడీపీకి చలి జ్వరం వస్తుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వస్తే ఆ పార్టీకి దారుణంగా దెబ్బతింది. వచ్చిన సీట్లు కూడా అచ్చంగా 23 మాత్రమే.


ఇక టీడీపీ కొనుగోలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా 23 మంది మాత్రమే.  ఈ విషయం ఇలా ఉంటే బాబు దగ్గరుండి మరీ ఆర్భాటంగా గత ఏడాది ప్రమాణం చేయించిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి  పదవి పోయింది కూడా ఇదే 23 డేట్ కావడం ఇపుడు  సోషల్ మీడియాలో హాట్  టాపిక్ గా ఉంది. 


నాడు కేంద్రంలో చక్రం తిప్పేంద్దామని చంద్రబాబు కర్నాటకకు వెళ్లారు. అక్కడే రాహుల్ ని చూసి కన్ను కొట్టారు. ఆ తరువాత ఆయన కొంప కూడా ముంచారు. ఇక ఇపుడు కుమారస్వామి సీటు కూడా చిరిగిపోయింది. 23న జరిగిన విశ్వాసపరీక్షలో ఆయన  పదవి పోగొట్టుకున్నారు. మొత్తానికి 23 నంబర్ బాబుకే కాదు ఆయన మిత్రులను కూడా గట్టిగానే వెంటాడుతోంది. రాబోయే  ఆగస్ట్ 23 ఏం చేస్తుందో. 


ఎందుకంటే ఆగస్ట్ నెల అంటే వెరీ బ్యాడ్ మంత్ అని టీడీపీకి యాంటీ సెంటిమెంట్ ఉంది. ఇక 23 డేట్ కూడా బ్యాడ్ అన్నది కూడా టీడీపీకి బాగా తెలుసు. ఈ రెండూ కలసి వస్తున్న వచ్చే నెల టీడీపీలో ఏం జరుగుతుంది. ఈ టెన్షన్లో ఇపుడు పసుపు శిబిరం నిలువెల్లా వణికిపోతోందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: