వై.ఎస్. జగన్.. ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో పని చేస్తున్న అధికారిని ఏపీకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపకపోతే.. ఢిల్లీ స్థాయిలో లాబీ చేయిస్తున్నారు.


ఆమె ఎవరో ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. ఏపీలో ఆమె పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి బదిలీ కోసం ఆమె విజయసాయిరెడ్డితో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, అమిత్ షాను కూడా కలిశారు.


మరి ఓ ఐ ఏఎస్ అధికారి కోసం జగన్ ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నారు. ఆమెపై జగన్ కు ఎందుకు అంత ఇంట్రస్ట్.. ? ఇందుకు చాలా బలమైన నేపథ్యమే ఉంది. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో బాగా ఇబ్బంది పడిన వారిలో శ్రీలక్ష్మి ఒకరు.


అప్పట్లో ఆమె గనుల శాఖలో పనిచేసేవారు. జగన్ పై కేసుల కారణంగా ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఎల్లో మీడియా కారణంగా ఆమె చాలా క్షోభ అనుభవించారు. అందుకే ఆమెకు అండగా నిలవాలని జగన్ భావిస్తున్నారు.


ఏపీకి తీసుకువచ్చి ప్రాధాన్యత ఉన్న పోస్టు ఇవ్వాలని తపనపడుతున్నారు. నమ్మినవాళ్లును గుర్తుంచుకుని ఆదుకోవడంలో తమ కుటుంబానికి ఉన్నపేరు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: