కన్న కొడుకే కోడలితో కలిసి తనను వేధిస్తున్నాడని అంతేకాకుండా నాఇంటి నుంచి నన్ను వెళ్లగొడుతున్నారంటు 70 సంవత్సరాల వృద్ధురాలు 2015 సంవత్సరంలో నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో తల్లి ఫిర్యాదు మేరకు కొడుకు అమిత్ కుమార్ మరియు కోడలు షోబిత లావణ్య లపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు విచారణ జరిపిన కోర్టు వారిద్దరికీ రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది.

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి 70 సంవత్సరాల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2013 సంవత్సరంలో భర్త చనిపోయాడు, భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరు కాపురాలు ఉంటున్నారు. 
భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ భార్యతో సహా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించడమే కాకుండా తల్లిని బలవంతంగా బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. 

ఇది భరించలేని తల్లి 2015 సంవత్సరంలో నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు సంవత్సరాలు పాటు కోర్టులో నడిచిన కేసు తన తీర్పును వెల్లడించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: