బెంగాల్ లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చూస్తున్నది.  ఇందులోకోసం ఇప్పటి నుంచే పావులు కడుపుతున్నది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలుచుకొని ఎవరూ ఊహించని విధంగా బెంగాల్ లో అడుగుపెట్టింది.  అనంతరం అదే దూకుడును ప్రదర్శించి.. 18 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. 

ఈ విజయంతో బెంగాల్ బీజేపీలో మంచి ఉత్సాహం నిండింది.  ఎలాగైనా అక్కడ పాగావేయాలని చూస్తోంది బీజేపీ. హిందూ కార్డు ను ప్రయోగించేందుకు సిద్ధమైన బీజేపీ.. జై శ్రీరామ్ పేరుతో కొన్ని వేళా పోస్ట్ కార్డులను రాసి ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం అయ్యింది.  


మమతా బెనర్జీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అనేకమంది రోడ్డు పక్క నుంచి జైశ్రీరామ్ అని పెద్దగా నినాదాలు చేస్తే.. ఆమె కారు దిగి అలా నినాదాలు చేసిన వ్యక్తులను ఉద్దేశించి కోపంగా మాట్లాడిన సంగతి తెల్సిందే.  ఇలా నినాదాలు చేసే వ్యక్తులు బెంగాల్ కు చెందిన వారు కాదని, బయటనుంచి వచ్చిన గూండాలని చెప్పారు.  


ఇప్పుడు వేలాది మంది హిందువులు జైశ్రీరామ్ అనే పేరును కార్డుపై రాసి ప్రభుత్వానికి పంపుతున్నారు.  మరి ఈ పోస్ట్ కార్డులు రాసేవారంతా బెంగాల్ కు చెందిన వారు కదా అని ప్రశ్నిస్తున్నారు.  పాపం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పోస్ట్ కార్డుల బెంగ పట్టుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: