గతంలో టీడీపీ ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు చేపట్టిన అన్న క్యాంటీన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం దానిని కంటిన్యూ చేస్తూ, అన్న క్యాంటీన్ అనే పేరును మార్చి రాజన్న క్యాంటీన్ గా నడుపుతున్నారు. జిల్లాలో ఉన్న పన్నెండు క్యాంటీన్ లకు ఇలాగే పేరుమార్చారు. 



క్యాంటీన్ లకు వైట్ పెయింట్ వేసి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు రాజన్న క్యాంటీన్ పేరు రాయించి ఫ్లెక్సీ లు కటౌట్ లు ఏర్పాటు చేశారు. దీంతో అన్న పేరు పోయి రాజన్న పేరు వచ్చింది.మొన్నటి వరకూ పసుపు మయంగా ఉన్న క్యాంటీన్ ఇప్పుడు పచ్చగా మారింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: