ప్రధాని మోడీ పార్లమెంట్ లో ఓ చిన్నారిని ఆడించిన ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తుంది. ఫోటో పెట్టిన దగ్గర్నుంచి ఆ చిన్నారి ఎవరని తెగ చర్చించుకుంటున్నారు. క్రికెటర్ రోహిత్ శర్మ కూతురు అని కొందరు,అమిత్ షా మనవరాలని మరి కొందరు కామెంట్లు పెట్టారు.అయితే ఆ  చిన్నారి ఎవరనేది ఇప్పుడు తెలిసిపోయింది.

బిజీ షెడ్యూల్ లోను ప్రధాని తనకోసం వచ్చిన బుల్లి స్నేహితుడితో కాసేపు సరదాగా ఆడుకున్నారు.మోడీ ఆ చిన్నారితో ఆడుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ... చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈరోజు పార్లమెంట్ లో నన్ను కలుసుకున్నారు అని కాప్షన్ ఇచ్చారు. పోస్ట్ పెట్టిన గంటల్లోనే లక్షల్లో లైక్ లు వచ్చాయి.

అయితే మోడీ చేతుల్లో ఉన్న చిన్నారి ఎవరని తెలుకోవాలని నెటిజన్లు తెగ ప్రయత్నిచారు. ప్రధాని చేతుల్లో ఎలాంటి బెరుకు లేకుండా ధీమాగా ఉన్న ఈ బుడతడు బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా మనవడిగా తెలిసింది. మర్యాదపూర్వకంగానే మోడీని కలుసుకున్నట్టు ఎంపీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: