అమరావతి ఈ పేరు పెట్టింది రామోజీరావుట. ఆయన టీడీపీ అనుకూలుడు అన్నది అందరికీ తెలిసిందే. ఎపుడో చరిత్రలో అమరావతికి ఓ విశిష్టట ఉంది. అందువల్ల ఆ పేరు మీద రాజధాని నిర్మిస్తే ఏపీకి బాగుంటుందని రామోజీ సలహా ఇచ్చారని చంద్రబాబే అప్పట్లో అనేకమార్లు చెప్పుకున్నారు. గత అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు అమరావతిని గురించి తలవని ఘడియ అంటూ లేదు.


అటువంటి కలల రాజధాని విషయంలో జగన్ ఏమీ చేయడంలేదన్నదే బాబు బాధ. అమరావతిని వైసీపీ సర్కార్ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వడంలేదని టీడీపీ గగ్గోలు పెడుతోంది. ఆ విధంగా దుమ్మెత్తి పోసి జనంలో జగన్ని మరింతగా  పలుచన చేయాలన్నది బాబు ఎత్తుగడ. అమరావతి, పోలవరం ఈ రెండు విషయాల్లో టీడీపీ పెట్టిన శ్రధ్ధ జగన్ చూపించడంలేదన్నది ప్రజల్లోకి తీసుకెళ్తే జగన్ పాపులారిటీ ఒక్కసారిగా డౌన్ అవుతుందని కూడా ఆలోచిస్తోంది.


దీంతో అమరావతి మీద జగన్ స్టాండ్ చూసుకుని చంద్రబాబు అక్కడే దీక్ష చేపట్టాలని అనుకుంటున్నారుట. బ్రహ్మాండమైన అమరావతి రాజధానిని ఎందుకూ కాకుండా జగన్ చేస్తున్నాడన్న విమర్శలకు తోడు బాబే స్వయంగా దీక్షకు దిగితే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోందిట. దీని కోసం జనసేన పవన్ని, వామపక్షాలను కూడా కలుపుకుని దీక్ష చేయాలని బాబు అనుకుంటున్నారట. మరి జగన్ అమరావతి విషయంలో ఏ సంగతీ తేల్చకపోతే ఇబ్బందుల్లో పడాతారేమోనని వైసీపీ నేతలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: