అరేరే .. తెలుగు దేశం ఫైర్ బ్రాండ్, వారి తప్పులు వారే గుర్తించి వారి అరాచకాలను ప్రజల ముందు పెట్టె తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కి కష్టాలు మొదలయ్యాయే, ఎలా అబ్బా ఈ కష్టాలను తీర్చేది. ఎప్పుడు ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పుకునే 'కేశినేని నాని'కి ఇన్ని కష్టాలు వచ్చాయే అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 


మా పార్టీకి మేము ముగ్గురం చాలు అని మొన్ననే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన నాని ఉన్నట్టుండి ఉచ్చులో పడ్డారే అంటూ వాపోతున్నారు నెటిజన్లు. వాస్తవానికి వస్తే కేశినేని నాని 'కేశినేని ట్రావెల్స్' కార్మికులకు జీతాలు ఇవ్వలేదని వారు ధర్నాకు దిగారు. దీంతో కేశినేని నాని ని ప్రశ్నలతో చుట్టుముట్టింది మీడియా. 


ఈ నేపథ్యంలోనే కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ అతను 2013 నుంచే కేశినేని ట్రావెల్స్ బాధ్యతల నుంచి తప్పుకున్నారని, కానీ అతని పేరు మీదే ట్రావెల్స్ ఉన్నాయని అయన చెప్పుకొచ్చారు. ఈ విషయంపైనే వైసీపీ నేత పివిపి ట్విట్ చేశారు. ఈ ట్విట్ గురించి యాంకర్ ప్రశ్న వెయ్యగా 'ఎక్కడైనా కేసు వేసుకోమనండి, నేను రెడీ టు ఫేస్' ఏం చేసుకుంటారో చేసుకోమనండి' అంటూ సమాధానం ఇచ్చారు నాని. ఈ వీడియో క్లిప్ తీసుకొని 'కేశినేని నాని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ 'దేనికైనా సిద్ధం' అంటూ ట్విట్ చేశారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: