అంతేకాదు జేసీ దివాకర్ రెడ్డి అయితే జగన్ మావాడే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు పార్టీ ఓటమి పాలై ఇటు తమ వారసుల ఓడిపోవడంతో మౌనం వహించక తప్పలేదు జేసీ బ్రదర్స్ కి. కానీ గత కొన్ని రోజులు గా ఒక్కసారి గా సీన్ మారింది జేసీ బ్రదర్స్ వాయిస్ పెంచారు, సవాళ్లు విసురుతున్నారు. అటు చూస్తే టిడిపి ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదు, ఎవరు ఎప్పుడు సైకిల్ దిగుతారో అర్థం కాని పరిస్థితి.
ఇటు చూస్తే తాడిపత్రి లో ఏమాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని కేతిరెడ్డి తేల్చిచెప్పేసారు, ఇలా మొత్తం ప్రతికూల వాతావరణం ఉన్నా జేసీ బ్రదర్స్ మళ్లీ వైసీపీ ని ఎలా టార్గెట్ చేస్తున్నారు వీరి దూకుడు వెనుక ఉన్న శక్తి ఏంటి అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. దివాకరెడ్డి కొంత మౌనంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి అంత పర్యటిస్తూ వైసిపి మీద విమర్శలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ దూకుడు పెంచటానికి అసలు కారణం బీజేపీనే అన్న చర్చ టిడిపిలో ను సాగుతోందట.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేసీ బ్రదర్స్ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చర్చ సాగింది అయితే ఆ ప్రచారాన్ని జేసీ బ్రదర్స్ ఖండించారు.అయితే ఇప్పుడు బీజేపీ తో మంతనాలు కూడా ముగిశాయని పూర్తి భరోసా లభించిన తర్వాతే వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు.
అటు జేసీ పవన్ మాత్రం బిజెపి లోకి వెళ్లేది లేదని చెబుతున్నారు, అంతా ప్రచారమే అని ఖండిస్తున్నారు కానీ వైసీపీ ఏం చేయగలదు మహా అయితే జైల్లో పెడతారు అంతేకదా అనేదాకా ప్రభాకరెడ్డి వెళ్లడం వెనుక మాత్రం బలమైన పొలిటికల్ పవర్ ఉందని అది బిజెపినే అన్న గుసగుసలు టిడిపి లో వినిపిస్తున్నాయట. జేసీ బ్రదర్స్ దూకుడు వెనక అసలు కారణం ఏంటన్నది అతి త్వరలోనే తేలిపోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.