సువిధ స్వచ్ఛంద సంస్థ వారి తెలుగు మిసిమి విభాగము ఆధ్వర్యవంలో శాక్రమెంటో, కాలిఫోర్నియా లక్ష్మీనారాయణ మందిరములో జూలై 13 న జరిగిన  త్రిగళ నవావధానము దిగ్విజయమైంది. తెలుగు అవధాన చరిత్రలో మొట్టమొదటి సారిగా ముగ్గురు అవధానులతో,  మూడు భాషలలో (వ్యావహారిక తెలుగు, అచ్చ తెలుగు, సంస్కృతము) ఒకే వేదిక పైన, ఒకే సమయములో, తొమ్మిది అంశములతో నిండుగా జరిగిన ఈ అపూర్వ కార్యక్రమానికి సుమారు 100 మంది వీక్షకులు శాక్రమెంటో, శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల నుండి విచ్చేసి దాదాపుగా 6 గంటల పాటు ఆసాంతం వీక్షించారు. ముఖ్య అతిథిగా తమిళనాట తెలుగులో అనేక రచనలు చేసిన కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి కుమారులు శ్రీనివాసు గారు విచ్చేశారు.
   
ఈ కార్యక్రమానికి అవధానులుగా అచ్చ తెలుగు అవధాని, కాశీ కవి డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు,  శ్రీ నేమాని సోమయాజులు గారు వ్యవహరించగా, అతి క్లిష్టమైన సంచాలకత్వ బాధ్యతను కేంద్ర సాహిత్య అకాడెమి బహుమతి గ్రహీత, ప్రజ్ఞాభాస్కర ఆచార్య శ్రీ రాణి సదాశివ మూర్తి గారు నిర్వహించారు. 


ఈ అవధానం మొత్తం తొమ్మిది అంశాలతో  జరుపబడింది. నిషిద్ధాక్షరిని శ్రీ తల్లాప్రగడ రామచంద్ర రావు గారు, దత్తపదిని శ్రీ పుల్లెల శ్యామసుందర్ గారు, సమస్యను శ్రీమతి మాజేటి సుమలత గారు, వర్ణనను శ్రీ బుడమగుంట మధు గారు, న్యస్తాక్షరిని శ్రీ పంచాంగం అప్పాజీ గారు, నిర్వహించగా క్రొత్త అంశం "ఆంగ్ల అనువాదం" మరియు అప్రస్తుతములను శ్రీ మైలవరపు సాయికృష్ణ గారు నిర్వహించారు. ఆరేండ్ల బుడతడు  చిరంజీవి మద్ది అథర్వ పురాణపఠన      నిర్వహించటం ఈ కార్యక్రామానికి పెద్ద ఆకర్షణగా నిలిచింది. 


ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి, ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు నిలిచారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వెంపటి భాస్కర్ గారు, కార్యవర్గము పాలపర్తి వారిని "కుదురాట గండ" బిరుదుతో, పాలడుగు వారిని "అవధానభారతి", నేమాని వారిని "అవధానివతంస" బిరుదులతో సన్మానించారు. అట్లే, సంచాలకులు ఆచార్య రాణీ వారిని "సంచాలకాసుధాకర" బిరుదముతో సత్కరించారు.


 సువిధ స్వచ్ఛoద సంస్థ అధ్యక్షులు శ్రీ వెంపటి భాస్కర్ గారు సభాముఖంగా వీక్షకులకు, సంచాలకులకు, పృచ్ఛకులకు, అవధానులకు, అట్లే కార్యవర్గమునకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ దురిశెట్టి రావు గారు, శ్రీధర్ గారు, శశాంక్ గారు, ధ్వని సహకారాన్ని అందించగా, శ్రీ మార్క్ కేంబ్రిడ్జి గారు చలన చిత్ర సహాయాన్ని అందించగా, శ్రీ వెంపటి భాస్కరు దంపతులు, శ్రీ మైలవరపు సాయికృష్ణ దంపతులు, శ్రీ మద్ది అవినాశు దంపతులు, శ్రీ బైని జితేంద్ర గారు, శ్రీ యనమండ్ర శ్రీకాంత్ దంపతులు, శ్రీ చండ్ర నగేశు దంపతులు, శ్రీ బుడమగుంట మధు దంపతులు, శ్రీ హరీశ్ దంపతులు కలసి ఈ అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, స్థానిక అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ వారు ఆహూతులందరికీ విందునందించినారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: