బడ్జెట్ సమావేశాల్లో నారా లోకేశ్ చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు."టెంపరరీ పట్టిసీమ, టెంపరరీ క్యాపిటలు వీటికి సంబంధించి కేంద్రం 2000 వేల కోట్లు ఇస్తే దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అయితే ఒక సందర్భంలో చెప్పారు, రాజశేఖరరెడ్డి గారు కూడా అనుకున్నటువంటి అన్ని పనులు చేయలేకపోయాడు కాని ఏదో 50 శాతం మేనిఫెస్టోలో పెట్టాడు,ఇక చంద్రబాబునాయుడుగారు నేనొక్కడినే చెప్పినటువంటి ప్రతి పని కాకుండా చెప్పనటువంటివి కూడా చేశాను అని చెప్పి చెప్పటం జరిగింది.మాకు తెలిసినంతవరకు చంద్రబాబునాయుడుగారు చెప్పినవేవీ చేయలేదు, బడ్జెట్ లో ఎక్కడా నిధులు కేటాయించలేదు కానీ 5 బడ్జెట్ లలో కూడా ఎవరైనా ఒక మంచి పని చేస్తే చేశారని చెప్పుకోవాలి అధ్యక్ష. చంద్రబాబునాయుడుగారు ఒక కార్యక్రమం పెట్టారు.
చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న బెల్లం, శనగపిండి, బియ్యం అయ్యేమి పనికిరాలేదు అని ప్రజలు అందరు గలీజ్ గా ఉందని బయటపాడేసినారు.అయితే ఒకటి మాత్రం పనికొచ్చింది అధ్యక్ష, రైతులు అడంగల్, పాస్ బుక్కులు, వన్ బీలో పెట్టుకొని బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగడానికి, పేదవాళ్ళు నాకు పెన్షన్ ఇప్పించమని జన్మభూమి కమిటీల దగ్గరికి వాటికి సంబంధించినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎత్తుకొని తిరగడానికి, దరఖాస్తుదారునకు అయ్యా మాకు రేషన్ కార్డులు ఇవ్వమని తిరగడానికి, ఆ కాగితాలు ఏవి కూడా కింద పడి మాసి పోకుండా, చెమటకు తడిచిపోకుండా సంవత్సరానికి ఒక కొత్త సంచి ఒకటి ఇచ్చి మీరు తిరుగుతూ ఉండటానికి ఆ సంచి ఉపయోగపడింది తప్ప, చంద్రన్న సంక్రాంతి కానుకగా బజ్జీలు పోయటానికి మనకు ఉపయోగపడ్డటువంటి పరిస్థితి.
కాబట్టి ఇదివరకు ఎవరో ఒక పెద్దాయన చెప్పాడు.మ్యానిఫెస్టోకి సంబందించి పైన రంగులు చూడండి అని చెప్పి, అంటే మ్యానిఫెస్టో కు సంబంధించి లోపల మీరేమీ తప్పుపట్టటానికి వీలు లేదు కాబట్టి తప్పుపట్టే పరిస్థితిలో లేరు కాబట్టి మ్యానిఫెస్టో పైనున్నటువంటి రంగును గురించి మాట్లాడేటువంటి పరిస్థితేంటి లోపల ఉన్నటువంటి బడ్జెట్ కు సంబంధించి, నిధులకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి, ప్రతిదానికి ఒక ట్విటర్ ద్వారా ఉన్నాడు, ఏదొచ్చినా సరె ఆ ట్విట్టర్లో పెట్టుకొని దానికి సంబంధించి ఏదో చేయించడానికి, ఈ రోజు రాష్ర్టానికి సంబంధించి రకరకాలైనటువంటి పరిస్థితులుంటే వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు."ఈ విధంగా నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు.