వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ  జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా... ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది.

ఆయన ద్వారా కడప జిల్లాలో భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని.. ఇందుకోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగానే.. అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలోవైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఆయన పేరు చెప్పుకొని ఎన్నో అక్రమాస్తులు సంపాదించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 



జెల్లా జగన్మోహన్ రెడ్డికి... వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఆయన ద్వారా కడప జిల్లాలో భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని.. ఇందుకోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగానే.. అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


ఈ క్రమంలో కడప జిల్లా కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో రూ.15.22లక్షల విలువైన 27ఎకరాల పొలం, మణికొండ ల్యాంకోహిల్స్ లోని రూ.1.30కోట్ల విలువైన ఇల్లు, మొత్తం రూ.1,45,45,799విలువైన ఆస్తులను ఈడీ  జప్తు చేసింది. దీనిని సవాలు చేస్తే జెల్లా జగన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించారు.  కాగా, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: