ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే.. ఆశ్చర్యమేస్తోంది. ఇలా కూడా జరుగుతుందా.. 'తండ్రి పార్టీ'నే దెబ్బ తీస్తానని ఆ కూతురు ఎన్నడూ ఊహించి ఉండదు.  అలాగే ఆ తండ్రి అసలే ఊహించ ఉండడు.  అందుకే  రాజకీయాల్లో రక్త సంబంధాలు ఉండవని పెద్దలు ఎప్పుడో సెలవిచ్చారు.  ఇప్పుడు ఈ టీడీపీ విషయంలో అక్షర సత్యమై కూర్చుంది.  పైగా అధికారం కోల్పోయి..  పూర్తిగా  పార్టీ తుడుచుకుపెట్టిపోయే పరిస్థితుల్లో ఉందని  బాబుగోరు అండ్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు  తెగ ఫీల్ అవుతుంటే.. స్వయంగా  ఎన్టీఆర్ కుమార్తె  ద‌గ్గుబాటి పురందేశ్వ‌రే  టీడీపీను  ఇంకా దెబ్బ కొట్టేలా చేస్తున్నారు.  


అసలు విషయంలోకి వెళ్తే   ఏపీలో బీజేపీ చేప‌ట్టిన ఆపేరేష‌న్ ఆక‌ర్ష్ అనుకున్న దానికంటే  య‌మ స్పీడుగా దూసుకుపోతోంది. ఇప్పటికే అలాగే కొనసాగుతుంది. బీజేపీ అగ్ర నేత‌ల ఇంకా ఎత్తులు వేస్తూనే ఉన్నారు.  ఇతర పార్టీ నేత‌లను ఆకర్షిస్తూనే ఉన్నారు.  ఇప్పటికే   టీడీపీ నుంచి న‌లుగురు రాజ్యస‌భ సభ్యులు జెండా మార్చారు.  ఆ వెంట‌నే మ‌రో టీడీపీ నేత అంబికా కృష్ణ‌  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ క్రమంలో  బాబుగారి తన  రాజకీయ ఎత్తులతో వలసలను ఆపాలని చూస్తున్నా.. ఎవ్వరూ మాట వినడం లేదు. ఈ అనూహ్యమైన ఘటనతో ప్రజల్లో బాబు మరింతగా చులకన అయిపోతున్నారు. అందుకే  మన బాబోరు పార్టీ వదిలివెళ్ళిపోతున్న నాయకుల పై ఎలాంటి నెగిటివ్  కామెంట్లు చెయ్యకుండా  ఆ రకంగా ముందుకు పోతున్నాడు.  మొత్తానికి ఏ విషయాన్ని అయినా  తనకు అనుకూలంగానే మార్చుకునే బాబు,   నాయకులూ పార్టీ మారే  విషయంలో మాత్రం  ఏమి చేయలేకపోతున్నాడు.     


అందుకేనేమో తాజాగా కొంతమంది  టీడీపీ నేత‌లు  కూడా బీజేపీలోకి దూకేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ నేతలను  పురందేశ్వ‌రినే దగ్గర ఉండి బీజేపీలోకి  కలిపేస్తోందట.  ఆ మాటకొస్తే.. ఏపీలో ప్రస్తుతం బీజేపీలోకి వలసల పరంపర ప్లాన్ ను అమలు చేస్తోన్న వ్యక్తుల్లో ఆమె పాత్రే  అతి ముఖ్యమైనదని సమాచారం. కొంతమంది టీడీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి  ఆమె మాట ఎంతో కీలకం అంటా. మొత్తానికి ఎన్టీఆర్ పార్టీని  కూల్చేస్తోంది ఎన్టీఆర్ కుమార్తె కావడం విశేషం. ఎన్టీఆర్ కలలో కూడా ఊహించ ఉండరు.. తన కుమార్తె  తన పార్టీకి వ్యక్తిరేకంగా పని చేస్తారని.  ఏంటో ఈ రాజకీయాలు.  మొత్తానికి  ఎన్టీఆర్ కుమార్తెనే 'టీడీపీ'కి శాపంగా మారారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: