తాజాగా జరిగిన పరిణామం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్ సందర్భంగా జరిగిన వ్యవహారం అందకు ఊతమిస్తోంది. ఇంతకీ త్రిపుల్ తలాక్ బిల్లులో ఏం జరిగింది ? ఏం జరిగిందంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును  వైసిపి వ్యతిరేకించగా టిడిపి మద్దతు ప్రకటించింది. టిడిపి వైఖరితో భవిష్యత్తులు మారబోయే రాజకీయ సమీకరణలపై సూచనలు స్పష్టంగా కనబడుతోంది.

 

మొన్నటి ఎన్నికల్లో నరేంద్రమోడిని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్రస్ధాయిలో వ్యతిరేకించారు. 2014లో గెలిచిన తర్వాత నాలుగేళ్ళు కలిసే ఉన్నప్పటికీ చివరి ఏడాదిలో మాత్రం విడిపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారో అప్పటి నుండి మోడిని ఎంతగా వ్యతిరేకించాలో అంతగాను వ్యతిరేకించారు. ఎన్నికల సమయంలో అయితే కాలికి బలపం కట్టుకుని మరీ బయట రాష్ట్రాల్లో కూడా తిరిగి మోడి వ్యతిరేక ప్రచారం చేశారు.

 

సీన్ కట్ చేస్తే కేంద్రంలో మళ్ళీ రెండోసారి మోడినే అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో ముఖ్యమంత్రయ్యారు. దాంతో గోడ దెబ్బ చెంపదెబ్బ లాగ చంద్రబాబుకు మొహం వాచిపోయింది. ఏకకాలంలో అటు మోడి ఇటు జగన్ తో శతృత్వం పెట్టుకుంటే నష్టం తప్పదని చంద్రబాబుకు అర్ధమైపోయింది. దాంతో మెల్లిగా మోడికి దగ్గరవ్వాలని ప్రయత్నించారు. కానీ మోడి అందుకు ఒప్పుకోలేదు.

 

దాంతో చేసేది లేక ముందుగా తన బినామీలుగా ప్రచారంలో ఉన్న అత్యంత నమ్మకస్తులైన రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి ఫిరాయించేందుకు అనుమతించారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు చంద్రబాబు బినామీలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు రాజకీయ రక్షణకే వాళ్ళు బిజెపిలోకి వెళ్ళారన్న విషయం ఎవరినడిగినా చెబుతారు.

 

ఇందులో భాగంగానే మొన్న సమాచార హక్కు చట్టం సవరణల బిల్లుకు తాజాగా త్రిపుల్ తలాక్ బిల్లుకు టిడిపి మద్దతు ఇచ్చింది. అంటే ఏదో రూపంలో మోడికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మార్గాలు వెతుక్కుంటున్న విషయం అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: