ఎడ్యుకేషన్ వింగ్ అయిన విద్యా భారతి దీన్ని నిర్వహించనుంది . ఈ స్కూల్ కు ఆర్ఎస్ఎస్ మాజీ సరసంఘచాలక్ రాజేంద్ర సింగ్ అలియాస్ రాజు భయ్యా పేరుపెట్టనున్నారు .యూపీలోని బులంద్ షహర్ జిల్లా షికార్ పూర్ లో రాజు భయ్యా సైనిక్ విద్యా మందిర్ పేరుతో ఈ స్కూల్ ని ఏర్పాటు చేయనున్నారు . గత ఆగస్టులో 20,000 చదరపు మీటర్ల స్థలంలో స్కూల్ నిర్మాణం ప్రారంభమైంది . దీని కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు .
ఈ స్థలాన్ని మాజీ సోల్జర్ రైతు రాజ్ పాల్ సింగ్ డొనేట్ చేశారు.ఆర్ఎస్ఎస్ హయాంలో కొనసాగనున్న ఆర్మీ స్కూల్ లో సిబియస్ ఇ సిలబస్ ను అమలు చేయనున్నారు . 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ క్లాస్ లు నిర్వహిస్తారు . వచ్చే ఏప్రిల్ నుంచి స్కూల్ ప్రారంభమౌతుంది . తొలిభాషలో 160 మంది విద్యార్థులకి అడ్మిషన్ లు ఇవ్వనున్నారు . ఇందులో రిజర్వేషన్ స్కీమ్ కింద అమరవీరుల కుటుంబాల పిల్లలకు 56 సీట్లు రిజర్వు చేశారు .