ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. వైఎస్ జగన్ ఎప్పుడు విమర్శించే లోకేష్ ఉన్నట్టుండి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా ?


ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి, నారా లోకేష్ పాలకపక్షం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? కృతజ్ఞతలు అయితే చెప్పారు కానీ అది కూడా విమర్శిస్తూనే చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అందరూ నాలాగా అవినీతి పరులే అని ప్రజల్ని నమ్మించేందుకు జగన్ గారు విశ్వప్రయత్నం చేసిన పాపం ఫలితం లేకపోయింది అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 


అయితే ఐదేళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద అవినీతి ముద్ర వెయ్యలనుకున్నారు కానీ చేసిన ఆరోపణలను నిరూపించకపోగా వారి నోటితోనే టీడీపీ పాలనా అద్భుతం అని శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు వైఎస్ జగన్ గారు. పాలకపక్షం నాయకుడు అయి ఉండి ఇలా ఒప్పుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కి స్పందిస్తున్న నెటిజన్లు చాలు చాల్లే సెల్ఫ్ డబ్బా, ఒకటి మాట్లాడితే ఒకటి అర్థం అవుతుంది ఈ లోకేష్ కి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: