ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా తండ్రి చంద్రబాబు నాయుడుని పొగడ్తలతో ముంచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న లేకున్నా అయన చేసే పనులు ఏపీని గర్వాంగా తల ఎత్తుకునేలా ఉన్నాయని అంటున్నారు నారా లోకేష్. 


నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన వ్యవస్థలు ఏపీని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాయనడానికి ఏపీ మెడ్ టెక్ జోన్ ఒక ఉదాహరణ. విశాఖను దేశంలోనే మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ  మెడ్ టెక్ జోన్ ను డిసెంబర్ 2018లో చంద్రబాబుగారు ప్రారంభించారు.' అని అన్నారు. 


అవగాహనలేని, విలువ తెలియని వైసీపీ వాళ్ళు 'ఒక మయసభ' అంటూ హేళన చేసిన ఏపీ మెడ్ టెక్ జోన్ గురించి, కేంద్ర మంత్రి గడ్కరీగారు పార్లమెంట్ వేధికగా ప్రశంసలు కురిపిస్తే, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్రముఖులు ఆయనతో ఏకీభవిస్తూ చేసిన వ్యాఖ్యలను చూడండి. 'దటీజ్ చంద్రబాబుగారు'. అంటూ వైసీపీ నేతలను విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడుని పొగిడారు నారా లోకేష్.  


అయితే ఈ ట్విట్ చూసినా నెటిజన్లు స్పందిస్తూ 'చంద్రన్న చేసిన పనిలో ఒక్కదానికి మాత్రమే వాళ్ళు పొగిడారు, మీ నాన్నా చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి వాటిని విమర్శించే సమయం కూడా దగ్గర లోనే ఉంది, అప్పుడు కూడా ఇలానే ట్విట్ చెయ్యండి' లోకేష్ గారు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: