విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం...విజయవాడలో కుండ పోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం తడిసిముద్దయింది. నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.భారీ వర్షాలతో విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో డ్రెయిన్ లు పొంగి పొర్లడంతో జనం ఇక్కట్ల పాలయ్యారు. రోడ్ల పై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.విజయవాడలో కురుస్తున వానకి ఇళ్ళల్లోకి నీరు వస్తున్నాయి.విజయవాడ లో నిన్న అంతా మబ్బుగా ఉన్నాకుడా వర్షం అయితే మాత్రం ఉదయం నుంచే పడుతున్నాయి.ఐతే ఉదయం నుంచి పడుతున్న వానకే రోడ్లు మొతం జలమయం అయ్యాయి.
సైడ్ కాలవులు మొత్తం కూడా నీరుతో నిండి రోడ్డు మీదకి వస్తున్నాయి.దాంతో రోడ్డు సైడు కాలవలు కుడా కనిపించటంలేదు.పొద్దునుంచి కురుస్తున్న వర్షాల వల్ల పిల్లలకు స్కూళ్ళకి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.అలాగే ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది.ఈ వర్షాలకు ఫై ఓవర్ నిర్మాణానికి సంబందించిన ఇసుక,సిమెంట్,కంకర అన్నీకూడా రోడ్డు మీదకి కొట్టుకొచ్చే పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది.ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టం బ్లాక్ అయింది.కాసేపు కురిసిన వర్షాలకే రోడ్డ్ల మీద నీరు మోకాలలోతులోకి రావటంతో జనాలు బయిటికి రావటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ నగరంలో ఆటోనగర్ లోని ఎఐసిసి కాలినీలో అయితే హౌసెస్ లోకి ఆ కాలినీలోని ఇళ్ళలోకి కూడా నీరు వచ్చాయి.ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా అధికారులు అక్కడికి రావడం, రోడ్లను సమీక్షించడం జరిగింది.ప్రతీసారి ఇలానే అధికారులు రావడం చూసివెళ్ళడం తప్ప ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. కొంచెం సేపు కురిసిన వర్షానికే పరిస్తితి ఇలా ఉంటే ఎడతెరుపులేకుండా పడితే విజయవాడ నగరం ఏమవుతుందో అని ప్రజలు ఆందోళన పడుతున్నారు.