ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యని చుసిన నెటిజన్లు మండిపోతున్నారు. నెటిజన్లు మండిపోయేలా లోకేష్ ఎం అన్నారు అనుకుంటున్నారా. 


అదేనండి .. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అమ్మఒడి పథకాన్ని అందరికి అమలు చెయ్యడం లేదు అని .. అమ్మఒడి కాస్త ఆంక్షల బడి అయ్యిందని ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'అమ్మ ఒడి పథకంపై కూడా వైఎస్ జగన్ గారు తన మాట మార్చుడు, మడమ తిప్పుడును యథేచ్ఛగా సాగించారు. ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకి రూ.15 వేలు సాయం అన్నారు. అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి అనగానే తడబడటం ప్రారంభించారు.'


'మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చేసరికి తెల్లకార్డు ఉన్నవారికే అని, పిల్లల్లో ఒకరికే అని అమ్మ ఒడిని కాస్తా 'ఆంక్షల బడి' చేశారు. జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాలి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలు.. అంటే సగానికి సగం చేశారు. మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కు రేపు ఉదయం అధికార పార్టీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నుండి స్పందన వస్తుంది. కాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. కాస్త ఓపిక పట్టండి అన్నిటికి జగనన్న సమాధాలు ఇస్తారు అని ఒకరు సమాధానం ఇస్తే, మరికొందరు ఏంటి నీ కామెడీ అంటూ ట్విట్ చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: