ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిన్నారుల పై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. అయితే హత్యలు, కిడ్నాపులు, హైటెక్ వ్యభిచారాలు ఇలా డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంతమంది నేరాలకు పాల్పపడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూడో తరగతి విద్యార్థి ఆదిత్య (8) నింధితుడు గొంతు కోసి మరీ చంపాడు.
నిందితుడి కోసం క్లూస్ టీం, జాగిలాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఆ విద్యార్థిని ఎవరు చంపారు..ఎందుకు చంపారు అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పపడ్డారా..లేక ఇంకా ఎవరైనా ఇందులో సహాయం చేశారా అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మృతిచెందిన విద్యార్థి ఆదిత్యకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, అన్నయ్య ఉన్నారు. ఆదిత్య సోదరుడు ప్రస్తుతం అదే హాస్టల్ లో ఉంటున్నాడు..అశోక్ ఏడో తరగతి చదువుతున్నాడు.
అయితే నింధితుడు మొదల అశోక్ ఉంటున్న రూమ్ కి వెళ్లగా అశోక్ లేవకపోవడంతో ఆదిత్య వద్దకు వచ్చి అతన్ని లేపి పక్కకు తీసుకు వెళ్లి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక ఏదైనా కుటుంబ తగాదాలు ఉన్నాయా? ఎవరైనా ఉన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు చల్లపల్లి బీసీ హాస్టల్ వద్ద దాసరి ఆదిత్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్న ఆదిత్య బంధువులు.
ఈ నేపథ్యంలో దోషులను 48 గంటల్లో పట్టుకు తీరుతామని ఇప్పటికే నాలుగు బృందాలుగా పోలీస్ ఎంక్వైరీ జరుగుతుందని హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి పూర్తి సాక్ష్యధారాలతో హంతకులకు తగిన శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆదిత్య కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని అన్నారు కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్ పి మోకా సత్తిబాబు.