మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్ లోనే కాకుండా దేశంలో చాల చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి మేలు చేసే నిర్ణయం తీసుకుంటే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ పాకిస్థాన్ లో మాత్రం కొంతమంది మోదీని సపోర్ట్ చేస్తూ ప్రశంసల అందిస్తూ బ్యానర్స్ పెట్టి మరీ అభినందిస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. చాలామంది ఇండియన్సే దీన్ని తీవ్రంగా వ్యక్తిరేకిస్తుంటే.. పాక్ లోని కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఏమైనా మోదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోని ఉండొచ్చు.. ఈ బిల్లుని ప్రవేశపెట్టడంతో పాటు.. దాన్ని ఆమోద ముద్ర వేయించుకోవడం అంతా నాటకీయంగా సాగి ఉంచొచ్చు.. కానీ మోదీ చేసిందే కరెక్ట్ ఏమో అని అభిప్రాయపడేవాళ్లే ఎక్కువ. అందుకే మన దాయాది దేశంలో రాజధాని లాంటి ప్రాంతాల్లో కూడా జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చెయ్యడాన్ని స్వాగతిస్తూ.. ‘అఖండ భారత్ లక్ష్యాన్ని సైతం మోదీ పూర్తి చేయాలి’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల్ని ఆ బ్యానర్లలో పేర్కొనడం విశేషం. పైగా పాక్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్తో కూడిన అఖండ భారతదేశ చిత్రాన్ని సైతం ఉంచడం భారతీయులను ఆలోచింపజేస్తోంది. పాకిస్థాన్ లో భారత్ ని ఇంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారా అని.
కానీ ఈ విషయంలో మోదీని అతి తీవ్రంగా విమర్శించేవారిలో మన భారతీయులు అందునా ప్రముఖులు ఉండటం బాధాకరమైన విషయమే. వారి ఆరోపణల్లో ప్రధానంగా ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అక్కడ అదుపు తప్పుతున్న పరిస్థితులకు పూర్తి కారణం మోదీనేనని.. కేవలం మోదీ కుట్రపూరితంగానే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిలను బయటకి రాకుండా కట్టుదిట్టం చేసారని ఇలా చాలా విషయాల మీద రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రంగా మండపడుతున్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజూ అన్నట్లు వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజ్యసభలో ఏకంగా కాశ్మీర్ చెందిన పీడీపీ పార్టీ సభ్యులు.. చొక్కాలు చించుకొని మరీ తీవ్ర పదజాలంతో నిరసనలు వ్యక్తం చేస్తూ.. సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిన సంఘటన చూశాం. కాశ్మీర్ ఎంపీలు నజీర్ అహ్మద్ లావే, మీర్ మహమ్మద్ ఫయాజ్ రాజ్యాంగ ప్రతులను చించేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులూ కొంతమంది మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఏంటో ఈ రాజకీయాలు పగోడి మెచ్చుకుంటున్నాడు.. మనోడు మాత్రం దెప్పిపొడుస్తూ విమర్శిస్తున్నారు.