వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు ఫలితాలు వచ్చి మూడు నెలలు అయినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే విజయసాయి రెడ్డి అధికారంలోకి వచ్చిన అది మానడం లేదు.  


ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎందుకు ఓడిపోయారో మీకు తెలీదా ? ఇంకా అర్ధం కావడం లేదా ? ఈ మాటా చెప్పడానికి మీకు సిగ్గు ఉండాలి అంటూ సంచలన ట్విట్ చేశారు. ఆ ట్విట్ 'ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?  పాడి ఆవులాంటి  ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.'


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ట్విట్ చేస్తూ 'బాబుగారి అంతరార్థం ఏంటంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం నా 40సం. అనుభవం, నా ఎన్నికల మేనేజ్మెంట్ తో సెట్ చేశాను కదా. ప్రజలకు ఇవన్నీ ఎలా అర్థమయ్యాయి. నేనే తెలివైన వాడ్ని కదా! మొదటి సారిగా నా రాజకీయ చతురత ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని తనలో తానే మధనపడుతూ ఉన్నారు.' అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: