ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చురుకుగా స్పందిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తాజాగా మ‌రో అంశంపై అదే రీతిలో ఓ అంశంపై స్పందించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దు, ఆ రాష్ట్ర విభజన జ‌రిగిన అంశంలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ రాముల‌మ్మ ట్వీట్ చేశారు. ఈ బిల్లు ఆమోదం విష‌యంలో టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తివ్వ‌గా...ఆ పార్టీకి మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎం వ్య‌రేతికించింది. ఈ నేప‌థ్యంలో రాముల‌మ్మ  కేసీఆర్ తీరును ప్ర‌స్వావిస్తూ సోష‌ల్ మీడియాలో స్పందించారు. 


``దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును సమర్ధిస్తున్నట్లు టీఆరెస్ ఎంపీలు చెప్పారు. తెలంగాణలో ఎంఐఎంతో మైత్రిని కొనసాగిస్తూ...బీజేపీని ప్రత్యర్ధి పార్టీగా భావించే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు దేశ భద్రతకు ప్రాధాన్యమిచ్చి, కశ్మీర్ వ్యవహారంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం సహేతుకం. కానీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రదాన పార్టీల అధినేతలను కలిసి, వారిని ఒప్పించే విషయంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు...దేశ సార్వభౌమత్వంతో పాటూ దేశ భద్రతకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గారికి నచ్చజెప్పి, ఆయనను కూడా ఒప్పించి ఉంటే బాగుండేది.


ఎందుకంటే అందరికీ ఆమోదయోదగ్యమైన రీతిలో రాజ్యాంగబద్ధంగా కశ్మీర్ విభజన అంశంపై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే తాము కూడా అభ్యంతరం తెలిపేవాళ్లం కాదని అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో చెప్పడాన్ని విన్నాం. మరి మిగిలిన విషయాలపై ఎంఐఎం అధినేతతో మాట్లాడే కేసీఆర్ గారు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంపై ఆయనతో మంతనాలు జరిపి ఎంఐఎం మద్దతును కూడగట్టి ఉంటే తెలంగాణతో పాటూ దేశప్రజలు కూడా హర్షించే వారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆరెస్, ఎంఐఎంలు పొత్తుపెట్టుకోనున్న తరుణంలో కశ్మీర్ విభజన బిల్లుకు టీఆరెస్ మద్దతు తెలపడం ఈ కూటమిపై ప్రభావం చూపవచ్చని కొందరు విశ్లేషకులు చెప్పడం విన్నాను. కానీ ఈ విశ్లేషణలను, వాదనలను నేను పెద్దగా పట్టించుకోను.


ఎందుకంటే అవకాశానికి తగ్గట్లు తమ వైఖరిని ఎలాగైనా మార్చుకోగల సమర్ధత, ప్రజలను ఒప్పించగల చతురత కేసీఆర్ గారికి ఉన్నాయని పలు సందర్భాల్లో రుజువైంది. కశ్మీర్ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో అసదుద్దీన్ ఒవైసీకి వివరించి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ పొత్తుకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారు పావులు కదపుతారని భావిస్తున్నాను. ఈ వ్యూహాలు ఎత్తులు ఎలా ఉన్నా..తెలంగాణ జనానికి ఇప్పటికే టీఆరెస్ అధినేత వైఖరిపై ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.``అంటూ భారీ ట్వీట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: