ఆ మద్య కేరళాలో భారీ వర్షాలు, వరదలతో చిన్నాభిన్నం అయ్యింది.  మళ్లీ చాలా రోజుల తర్వాత ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కేరళా చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాల కారణంగా గురువారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా 14 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురున్నారు. భారీ వర్షాలకు అక్కడ ప్రజలకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే 22 వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.  అంతే కాదు అక్కడ వారి పరిరక్షణ కోసం 315 సహాయక శిభిరాలను ఏర్పాటు చేశారు కేరళ ప్రభుత్వం.

సహాయక చర్యల కోసం అదనంగా మరో 13 యూనిట్ల ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్మీని కోరారు.  లోతట్టు ప్రాంత వాసులు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. వరద బీభత్సంతో వణికిపోతున్న వయనాడ్‌ను ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కాగా, వయనాడ్‌లో గురువారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 మంది చిక్కుకుపోయారు.

ఇప్పటికే భారీ వర్షాలతో అక్కడి ప్రజలకు సతమతమవుతుంటే..ఈ నెల 14 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తిరువనంతపురం సహా 12 జిల్లాలు ఇప్పటికే వరద తాకిడికి గురయ్యాయి.  ఇడుక్కి, మలప్పురం, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గత రెండు సంవత్సరాల నుంచి వరుసగా కేరళాలో భారీ వర్షాల కారణంగా వందల మంది అనాథలుగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: