ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీవాళ్ళందరికి కొమ్ములు మొలిచినట్టున్నాయి అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు.  

 

 
నారా లోకేష్ ట్విట్ చేస్తూ 'వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీవాళ్ళందరికీ నెత్తిన కొమ్ములు మొలిచినట్టున్నాయి. కనపడిన వాళ్ళందరి మీదకు కొమ్ములు విసురుతూ హల్ చల్ చేస్తున్నారు. దొరబాబులూ! ప్రజలు మీకు అధికారమిచ్చింది సేవ చెయ్యడానికి, పెత్తనం చెయ్యడానికి కాదు. మీ డాబులు, దర్జాలు, దోపిడీలు కట్టిపెట్టండి.' అంటూ ట్విట్ చేసారు. ఈ ట్విట్ కు సంబంధించి ఓ వీడియో జత చేసి ట్విట్ చేశారు. 

 

 
అయితే ఈ ట్విట్ పై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ఏందయ్యా లోకేషం, ఎవడో ఎమ్మెల్యే పేరు చెప్పితే అది నిజమో కాదో తెలుసుకోకుండా నువ్వు ట్వీట్ పెట్టడం ఏంటి ? ఇవి అన్ని చూస్తుంటే ఇది నిజంగా ట్విట్టర్ పార్టీనే అనిపిస్తుంది. ఓడిపోయినక నీకు నిద్ర పట్టడం లేదు అనుకుంట, ట్విట్టర్ లో ఎం పెట్టాలో, ఎం పెట్టకుడదో కూడా తెలియడం లేదు కొన్నిరోజులు అమెరికాకి వెళ్లి రెస్ట్ తీసుకో లోకేష్' అంటూ ట్విట్లు పెడుతున్నారు నెటిజన్లు

 

మరింత సమాచారం తెలుసుకోండి: