విధ్య లేని వాడు వింత పశువు అని మన పెద్దలు ఒక జాతీయాన్ని పుట్టించారు. ఇది విధ్య విలువ గురించే చెప్పే మాటే. 'విద్య నేర్చుకుంటే.. జీవితాలు మారుతాయి. పేద కుటుంబాల జీవనశైలి మారుతుంది. రాబోయే తరాలు ఆనందంగా జీవిస్తాయి. పిల్లలను విధ్య వైపుకు ప్రోత్సహిస్తే.. వాళ్లు మరో తరాన్ని విధ్యతోనే పోగు చేస్తారు. అలా అందరూ చదువుకుంటారు. అందుకే మధ్యలోనే చదువు ఆపేసిన పిల్లలకు.. విద్య విలువ తెలియజేసి వాళ్ళను పాఠశాలలకు వెళ్లేలా చెయ్యాలి. జగన్ ఈ ఉద్దేశ్యంతోనే అమ్మబడి పథకాన్ని ప్రవేశపెట్టాడు. పైగా చిన్నారుల జీవితాల్లో అక్షరాల వెలుగులు పంచాలనే లక్ష్యంతో జగన్ మెత్తం విధ్యావ్యవస్థనే మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కాగా సమీక్షలో ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ రూపు రేఖలను ఎలా మార్చాలి అని విద్యాశాఖ అధికారులతో జగన్ చర్చలు జరిపారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు హై స్కూల్స్ రూపురేఖలు మార్చాలని జగన్ నిర్ణయించారు. మెయిన్ గా టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్స్ వంటివి మెజార్టీ స్కూల్స్ లో పిల్లలు సంఖ్యకు తగ్గట్లుగా లేవని త్వరగా వాటిని ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. అలాగే పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులతో పాటు అదనపు తరగతి గదులను కూడా నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్ ఉన్నారన్న విషయాన్ని కూడా జగన్ అధికారులను ప్రశ్నించారు. ఎలాగైనా ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. చదువు అనేది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనదని... సంఘం యొక్క అభివృద్ధి అందులోనే ఉందని.. విద్య మాత్రమే వెలుగునిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.