తనకు తెలియకుండానే వ్యభిచార కూపంలో కూరుకుపోయిన ఓ స్త్రీ కన్నీటి గాథ ఓ విటుడిని కదిలించింది. ఫలితంగా ఆమె ఆ నరకకూపం నుంచి బయటపడింది. సహజంగా వ్యభిచారి దగ్గరకు వెళ్లే ఏ కస్టమర్ అయినా ఆమె నుంచి సుఖం కోరుకుంటాడే గాని ఆమె సాధకబాధకాలు ఏ మాత్రం పట్టించుకోవడు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. చివరకు ఆమెను ఆ ఊబి నుంచి రక్షించాడు. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిరేకెత్తించిన ఈ సంఘనట దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్లో జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోను జోరుగా ట్రెండ్ అవుతోన్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కోల్కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెది చిన్న ఉద్యోగం కావడంతో వచ్చే జీతం సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. ఆమెకు పరిచయం అయిన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఉందని నమ్మించి అక్కడకు తీసుకు వెళ్లింది. అక్కడకు వెళ్లాక ఆమెను ఓ వ్యభిచార ముఠాకు అమ్మేసింది. వాళ్ల చేతికి చిక్కిన ఆమెకు రెండు నెలలుగా నరకం చూపిస్తున్నారు.
వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఆమె రెండు నెలల పాటు ఎంతో మంది కస్టమర్ల చేతుల్లో తీవ్ర హింసకు గురైంది. ఇటీవల ఆమె వద్దకు కోల్కతా కస్టమర్ వచ్చాడు. అతడు ఆమె పాలిట దేవుడిలా మారాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
చివరకు ఆమె సోదరుడు ఆ యువతి దగ్గరకు కస్టమర్గా వెళ్లాడు. అక్కడ ఆమె దీనస్థితి చూసి చలించిపోయాడు. చివరకు అక్కడ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్ను ఆశ్రయించాడు. మహిళా కమిషన్ సభ్యులు పోలీసులతో అక్కడ దాడి చేసి ఆ యువతికి విముక్తి కల్పించారు. ఏదేమైనా ఆమె దగ్గరకు వెళ్లిన కస్టమర్ చేసింది తప్పే అయినా ఆమెను ఆ కబంద హస్తాల నుంచి రక్షించి ఆమె జీవితంలో వెలుగులు నింపాడు.