ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు.  ఉదయం పూట రెక్కీలు నిర్వహిస్తూ..రాత్రి పూట ఇళ్లలో జొరపడి అందినంత దోచుకుంటున్నారు, అడ్డు వచ్చిన వారిని ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు ఓ రేంజ్ లో కొనసాగాయి.  తాము కన్నం వేయాలనుకున్న ఇంటిని కొంత కాలం పరిశీలించి అక్కడ ఎవరెవరు ఉంటున్నారన్న విషయాన్ని గమనించి రాత్రి వేళల్లో ఎటాక్ చేయడం వారి పని..ఈ సమయంలో వారికి ఎదురు తిరిగిన వారిని తీవ్రంగా గాయ పర్చడం లేదా చంపేయడానికి కూడా వెనుకాడని సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొంత కాలంగా చెడ్డీ గ్యాంగ్ పై పూర్తిగా నిఘా పెట్టిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ మద్య హైదరాబాద్ లాంటి మహానగరంలో బీహారీ దొంగలు మరికొంత మంది రాత్రి పూట దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడం..వారిపై నిఘా పెట్టడం జరుగుతుంది.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వృద్ద దంపతులు తమ ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలను చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు విసురుతూ వారిని ప్రతిఘటించడం వైరల్ గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.   ఇద్దరు ఆగంతకులను వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నారని..వారిని ఈజీగా దోచుకోవచ్చు అన్న ఆలోచనతో మారణాయుధాలు దరించి ముసుగు వేసుకొని వచ్చారు. 

మొదట ఓ దొంగ అక్కడ పని చేసుకుంటున్న వృద్దుడి వద్దకు వచ్చి చేతిలో ఉన్న టవల్ ని అతని మెడకు చుట్టి కట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి ఆ వృద్దుడి భార చూసి అక్కడే ఉన్న వస్తువును అతడిమీదకు విసిరింది. అంతే వెంటనే ఆ దొంగ నుంచి విడిపించుకున్న వృద్దుడు సైతం దొంగలపై చేతికి ఏది దొరికితే అది విసరడం ప్రారంభించారు.  ఇలా ఇద్దరు భార్యా భర్తలు కుర్చీలు..ఇతర వస్తువులు ఆ దొంగలపై విసిరారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నా..తమపైకి వస్తున్నా ఏమాత్రం భయపడకుండా దాడి చేయడంతో తోక ముడ్చుకొని వెళ్లిపోయారు. తాజాగా ఆ వృద్ద దంపతుల సాహసాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: