విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మితిమీరిన వేగం ప్రాణాంతకమని మరో సారి రుజువైంది. తెలంగాణ కాంగ్రెస్  సీనియర్ పొన్నాల లక్ష్మయ్య మనవడు కోడూరి దృపత్  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  ఈ ఘటనతో  పొన్నాల లక్ష్మయ్య సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పొన్నాల సోదరి మనవడు అయిన ధృపత్‌(22) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్రో సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ధృపత్‌ డివైడర్‌ను ఢీకొట్టాడు.  ధపత్ నడుపుతున్న బైక్ TS03 EQ 8223.పల్టీలు కొట్టింది.



తలకు బలమైన గాయమైంది. దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఇప్పటికే రోడ్డు ప్రమాదాల్లో కోమటిరెడ్డి ఇంట వారసుడు , మాజీమంత్రి నారాయణ తనయుడు, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ తదితరుల తనయుడు అతి వేగంగా వాహనాలను నడుపుతూ.. ప్రాణాలను కోల్లోయారు. తాజాగా పొన్నాల ఇంట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పొన్నాల లక్ష్యయ్య ఆస్పత్రికి వెళ్లారు. దృపత్ మృతితో పొన్నాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



పలువురు రాజకీయ నేతలు పొన్నాలకు సంతాపం తెలిపారు. కాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ  ఘటన జరిగింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీంతో  చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు.ఇదిలా ఉండగా అంతకు ముందు సిద్ధిపేట కరీంనగర్ రహదారిలోని గుండ్లపల్లి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ 15ఏయు 3039 నెంబరు గల కారు అతివేగంతో ఏకంగా ఓ ఇంటి గోడ మీదకు దూసుకుపోయింది. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు అవుటర్ రింగ్ రోడ్డులో నిత్యం జరుగుతూనే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: