మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక సన్నివేశం ట్రైన్ సీన్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఈ ట్రాక్ సుమారు 35 నిముషాలు ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఈ సీన్ హైలైట్ కాబోతుందని ఇప్పటికే దర్శకుడు కూడా ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ మినహా అన్ని అయిపోయాయని, దీనితో ఫస్ట్ హాఫ్ అయిపోతుందని తెలుస్తుంది. ఇక మిగతా సన్నివేశాలు కొండా రెడ్డి బురుజు సెట్ మీద తీస్తారని తెలుస్తుంది. ఈ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు. అయితే ఇప్పటికే వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న మహేష్ .. ఈ సినిమాతో మూడో హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. 


నిజానికి మహర్షి  తరువాత మహేష్ సినిమా  సుకుమార్ తో ఉండాలి. సుకుమార్ కూడా మహేష్ కోసం ఒక స్టోరీ లైన్ వినిపించిన సంగతీ తెలిసిందే. అయితే ఆ స్టోరీ లైన్ మహేష్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. తరువాత సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమాను ప్రకటించడం, తరువాత  మహేష్ — సుకుమార్ వివాదం కొన్ని రోజులు మీడియాలో రావటం అవన్నీ మనకు తెలిసిందే. 


ఇక అనిల్ రావిపూడి కూడా వరుసగా హిట్స్ కొట్టి తక్కువ టైం లో టాలెంట్ ఉన్న డైరెక్ట్ గా గుర్తింపు పొందాడు.  f2 సినిమాతో అందరినీ ఎలా నవ్వించాడో మనం చుశాము. ఆ సినిమా తరువాత అనిల్ టాలెంట్ తెలుసుకున్న మహేష్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. దీనితో అనిల్ కు తక్కువ సినిమాలతోనే మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. ఇక మహేష్ సినిమాతో అనిల్ ఇంకొక హిట్ కొడితే .. ఇక తిరుగుండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: