ఒక అబద్దాన్ని పదే పదే చెప్పడం .. దానిని .. మరో పది మంది చేత చెప్పించడం దానిని నిజమని నమ్మించడం చంద్రబాబు ఇన్ని రోజులు ఫాలో అయిన ఫార్ములా. తన అనుకూల మీడియా ద్వారా ఇదే సూత్రాన్ని ప్రజల్లోకి పంపించేవారు. కానీ ఒకప్పుడు ఈ సూత్రం బాగా పని చేసేడేమో గాని ఇప్పుడు మాత్రం కాలం చెందింది. ప్రజలు ఇప్పుడు చాలా స్మార్ట్ ఏది నిజమో ఏది అబద్దమో ఇట్టే పసిగడతారు. కానీ చంద్రబాబుకు ఇంకా ఆ విషయం అర్ధం కావటం లేదు. 2019 ఎన్నికలో ఇదే సూత్రాన్ని అవలంభించి అధికారంలోకి రావాలని ప్లాన్ వేశారు. కానీ బెడిసి కొట్టింది. ఎన్నికలో టీడీపీ పార్టీ ఎప్పుడు చూడని భారీ ఓటమి తన ఖాతాలోకి వేసుకుంది. 


ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు.


దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడైతే ఈ అబద్దాలు .. జనాలను మభ్యపెట్టడం మానేస్తారో అప్పుడే బాబుగారు మారిపోయారని జనాలు నమ్ముతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: