వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ పై ధ్వజమెత్తారు.             


నారాలోకేష్ కి వయసుకు తగ్గ మానసిక పరిణితి లేదని ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?


వయసుకు తగిన మానసిక పరిణితి లేని లోకేశ్‌ కంటికి ప్రతిదీ స్కామ్‌ లాగానే కనబడుతుంది. ఐదేళ్లు అడ్డూ అదుపు లేకుండా దోచుకున్న వాళ్లకి ఎదుటి వారి మీద బురద చల్లడం తప్ప ఇంకేం తెలుస్తుంది. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే హర్షించ లేని కుటిల మనస్తత్వం వీరిది. పిల్లల మధ్యాహ్న భోజనం, బాలికల సైకిళ్లు, చివరకు స్కూల్‌ విద్యార్థులకు ఇచ్చే బూట్లలో కూడా తెలుగు దొంగల పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారు. బాబు గారి పాలనలో బందిపోట్ల దోపిడీ లేని పథకమే లేదు. వీళ్లందరి నేరాలు రుజువైతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవేమో?' అంటూ ట్విట్టర్ లో ఒక ఆట ఆడుకున్నారు విజయసాయి రెడ్డి. మరి ఈ వ్యాఖ్యలకు నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: