వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గెలవలేకపోయారు కానీ కేంద్రాన్ని మారుద్దాం అని అనుకున్నారు, తీరా ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడం లేదు అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.             


ఎన్నికలకు ముందు దేశం మొత్తం తిరిగి అందరిని ఏకం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా వెళ్లారని వ్యాఖ్య చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని పదవి నుంచి మోదీని దింపాడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, మమతా బెనర్జీ, ఫరూక్ అద్బుల్లాలతో కలిసి పెద్ద ప్లాన్ వేశారు. కానీ చివరకు అందరిని ఆగం ఆగం చేసారని విజయ్ సాయి రెడ్డి అన్నారు. కానీ వారు ఫోన్లో మాట్లాడదాం అని ప్రయత్నిస్తే వారికీ దొరకడం లేదని ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.  


మోదీని గద్దె దింపేంత వరకు నిద్రపోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట, అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట.' అంటూ రాసుకొచ్చారు విజయసాయి రెడ్డి. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: