రాష్ట్రం లో నడుస్తున్నది కల్వకుంట్ల ప్రభుత్వమేనని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని ..అవును కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం లోనే ప్రభుత్వం నడుస్తోందని ..అందు లో తప్పేముంది ? రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు . కేంద్రం లో నడుస్తోంది మోడీ ప్రభుత్వం కాదా ? అంటూ నిలదీశారు . పొద్దున లేచింది మొదలు కెసిఆర్ కుటుంబం మీద పడి ఏడవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన విరుచుకుపడ్డారు . కెసిఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ నామినేటెడ్ కోటా లో పదవులు తెచ్చుకోలేదని , ప్రజలు ఆశిర్వాదిస్తేనే గెలిచారన్నారు .
కుటుంబపార్టీ ల గురించి మాట్లాడాల్సి వస్తే అందరి గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు . ఎంఐఎం తెరాస దోస్తీ ని బూచిగా చూపించి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు . ఎం ఐఎం పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదా ? అన్న తలసాని , కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ కు నిధులు తెప్పించి ప్రజల్లో పరపతి పెంచుకుంటే బీజేపీ ని ఎవరు కాదన్నారని ప్రశ్నించారు . నిన్న మొన్న బీజేపీ లో చేరిన ఓ పెద్ద మనిషి కూడా తెరాస మీద ఏదేదో మాట్లాడుతున్నారని పరోక్షంగా మాజీ ఎంపీ వివేక్ పై విమర్శలు గుప్పించారు . తెరాస లో ఆయన ఉన్నపుడు పార్టీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చిందని , అయన తండ్రి గౌరావార్దం హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేశామన్నారు .
ప్రజాస్వామ్య బద్దంగా బీజేపీ బలపడతానంటే ఎవరూ కాదనరని కానీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీ నేతలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు . తెలంగాణ లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది తెరాస యా ?బీజేపీ యా ? అన్న తలసాని , అన్ని వర్గాల పండగలను అధికారికంగా నిర్వహించింది తెరాస ప్రభుత్వమే తప్ప బీజేపీ కాదని గుర్తు చేశారు . బీజేపీ ఇంత వరకు ఒక్క గుడినైనా కట్టిందా ? , తమ ప్రభుత్వం హాయం లో యాదాద్రి కడుతున్నామని చెప్పారు . యాగాలు ,హోమాలు చేయడం కూడా బీజేపీ కి చేతకాదని .. తాము చేస్తున్నామన్నారు . మజ్లీస్ తో బీజేపీ ని పోరాడామనండి ..ఎవరు వద్దన్నారని అన్న తలసాని , మధ్యలో తెరాస ను బీజేపీ ఎందుకు లాగుతోందని ప్రశ్నించారు .