ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబరు 10 నుంచి వైయస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఆపరేషన్లు అవసరమైన వారు, కంటి అద్దాలు అమర్చాల్సిన వారిని గుర్తించనున్న వైద్యులు ఆతర్వాత క్రమం తప్పకుండా వారికి ఆపరేషన్లు, అద్దాల పంపిణీ చేయాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. ఈ క్రమంలో 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలని చెప్పారు. కనీసం ఆరు సంవత్సరాలకు ఒకసారి వాహనాలను మార్చాలని సూచించారు. వెయ్యి వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరులో టెండర్ల ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రతి కుటుంబానికీ హెల్త్ కార్డులను అందజేయాలన్నారు. వాటిని క్యు ఆర్ కోడ్తో కార్డుల జారీ చేయాలని చెప్పారు. దీనికి కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 104 వాహనాల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అప్పుడే ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది సులభంగా వైద్యులకు తెలుస్తుందన్నారు. దీనివల్ల చాలా ఉపయోగముంటుందని చెప్పారు. ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్ చేయగానే ఆ కార్డుదారునికి ఓటీపీ నంబర్ వస్తుందన్నారు. డిసెంబర్ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్రంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా అన్నారు. పశ్చిమగోదావరిలో పైలట్ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితా తయారుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరిలో పైలెట్ ప్రాజెక్టుగా రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఇప్పుడున్న వ్యాధులను రెట్టింపు చేయనున్నట్టు చెప్పారు. 2వేలకు పైగా వ్యాధులుకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయనున్నామని చెప్పారు. మూడు నెలల పాటు పథకం అమలును వైద్య,ఆరోగ్యశాఖ అధ్యయనం చేసిన తర్వాత క్రమంగా అన్నిజిల్లాలకు వర్తింపు చేయడం జరుగుతుందన్నారు. వైద్యం ఖర్చు రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీలోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దానికి కిందకు వచ్చే జబ్బుల జాబితాను కూడా తయారు చేయాలన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యత ఉండాలన్నారు. థర్డ్ పార్టీ ద్వారా ఆస్పత్రుల్లో తనిఖీలు చేయిస్తున్నామని అధికారులకు వివరించారు. ప్రమాణాలు పాటిస్తున్న, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులు ‘‘ఎ ప్లస్’’ మరియు ‘‘ఎ’’ కేటగిరీలో పరిగణించాలని చెప్పారు. లోపాలున్న ఆస్పత్రులను ‘‘బి’’లో ఉంచి వారికి కొంతకాలం గడువు ఇవ్వాలని సూచించారు. మళ్లీ తనిఖీలు చేసినప్పుడు అవేలోపాలు ఉంటే వాటిని నెట్వర్క్ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను కేటగిరీ ‘‘సి’’లో చేర్చి వాటిని జాబితానుంచి పూర్తిగా తొలగించాలన్నారు. ప్రతి గ్రామసెక్రటేరియల్లో నెట్ వర్క్ ఆస్పత్రుల జాబితా ఉంచాలని చెప్పారు.
అర్హతలున్న ఆస్పత్రులు ఏవైనా సరే.. నెట్వర్క్ ఆస్పత్రుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులను ‘‘ఎ ప్లస్’’ కేటగిరీలోకి తీసుకురావాలన్నారు. సెప్టెంబరు నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల తనిఖీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం వెలుపల సుమారు 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైల్లోని 150 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నవంబర్ మొదటివారం అందుబాటులోకి సేవలు తీసుకురావాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులనూ ‘ఎ ప్లస్ కేటగిరీలోకి తీసుకెళ్లాలి. అన్ని ఆస్పత్రుల ఫొటోలు తీసిన వైద్య ఆరోగ్యశాఖ మరమ్మతులకు సంబంధించి టెండర్లను కూడా సిద్ధంచేసిన అధికారులు స్కూళ్లులానే చేపట్టాల్సిన పనులను ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించాలని అధికారులకు ఆదేశం. ఐపీహెచ్ఎస్ ప్రమాణాల ప్రకారం ఏ పనులు ముందుగా చేపట్టాలో నిర్ణయించాలన్నారు. కొనుగోలు చేసిన మందుల్లో నాణ్యత ఉండాలన్న ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, పరికరాలు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు వారీగా ప్రాధాన్యతా క్రమంలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల బాగుచేయడంపై కార్యారణ ప్రణాళిక ఖరారు. 2020 డిసెంబర్ నాటికి టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను బాగుచేయాలన్నారు. అలాగే 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిసెంబర్ 2021 నాటికి పూర్తిచేయాలన్నారు. జూన్ 2022కి హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయం మందుల కోసం, రక్త పరీక్షల కోసం ఎవ్వరూ కూడా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఏ పరికరం కొనుగోలు చేసినా నిర్వహణ, మరమ్మతుల కోసం ఇబ్బంది పడకూడదన్నారు. ఏ పరికరం కొనుగోలు చేసినా టెండర్లలో నిర్వహణ కూడా ఒక షరతుగా ఉండాలన్నారు.
వైద్యపరికరాల సమర్థ నిర్వహణకు విభాగాన్ని ఏర్పాటు చేయండి. దీనివల్ల ప్రతి ఆస్పత్రిలో పరికరాలు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబరు, 2021 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాలన్నీ ఉండాలన్నారు. జూన్ 2022 నాటికి మొత్తం ఆస్పత్రులన్నీ పూర్తిగా మెరుగుపడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైయస్సార్ , క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి సదుపాయాలతో 5 క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కడపజిల్లాలో పూర్తిస్థాయి సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రి విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిల్లో పూర్తిస్థాయి సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రులు శ్రీకాకుళం , ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాల్టీ రీసెర్చ్ ఆస్పత్రులు, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు సెప్టెంబరు, అక్టోబరుల్లో వీటికి శంకుస్థాపనలు చేపట్టాలన్నారు.