ఈ మద్య యూత్ కి బుల్లెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  ఆ మద్య విజయ్ దేరవకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో బుల్లెట్ పై సిగరెట్ తాగుతూ చాలా స్టైలిష్ గా రావడం చూసి యూత్ ఇలాంటి వాహనాలపై మరింత మోజు పెంచుకుంటున్నారు.  కాస్త రేట్ ఎక్కువైనా సరే ఇలాంటి వాహనాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  అయితే ఇలాంటి క్రేజ్ ఉపయోగించుకొని ఓ ముఠా చేసిన నిర్వాకం ఎంతో మంది అమాయకులను బురిడీ కొట్టించింది.  సాధారణంగా బుల్లెట్ ఒక లక్ష రూపాయలకు పైగా ఉంటుంది. 

దాన్ని ఇంకా మోడలింగ్ చేయించాలంటే మరింత ఖర్చు అవుతుంది.  అలాంటి బుల్లెట్ కేవలం రూ.25 వేలకే వస్తుందంటే యువత ఎంత ఎమోషన్ కి గురి అవుతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇంత తక్కువ ధరలో తమకు కావాల్సిన బైక్ వస్తుందంటే ఎగిరి గంతేశారు..వెంటనే ఆ వాహనాన్ని కొనడానికి క్యూలు కట్టారు. 

అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్‌ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. సదరు ముఠా సభ్యులకు ఒక వ్యక్తి స్మగ్లింగ్ చేయడం ఆ బైకులను అతి తక్కువ రేటుకే కొనడం ఒక లక్ష ఉన్న బైకును కేవలం రూ.50 నుంచి రూ.25 వేలకు అమ్మడంతో యువత బాగా ఆకర్షితులు అయ్యారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.

దాంతో అసలు గుట్టు బయట పడింది. సదురు అమ్మకందారులకు ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. కాగా, అమ్మకానికి ఉన్న బుల్లెట్లు స్వాదీన పర్చుకొని స్టేషన్ కి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: